పూర్వజన్మ- పునర్జన్మ(మూడవ భాగం)

Submitted by devaprasna on Sun, 01/13/2019 - 06:56

రెండుజన్మల మధ్య విరామం:

రెండు జన్మల మధ్య విరామం వుంటుందా అనేది చాల ముఖ్యమైన ప్రశ్న. ఒక్కొక్కసారి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.అది వారి కర్మలను అనుసరించి ఉంటుంది. ఎలా? మరణించిన వారు వారి కర్మానుసారం కర్మ ఫలాన్ని పైలోకాల్లో అనుభవించి మిగిలిన కర్మశేషం (తీరని కోర్కెలు) ప్రకారం పునర్జన్మ తీసుకొనే సామజిక పరిస్థితులు ఏర్పడేవరకూ వారికి విరామం ఉంటుంది. ఆ సమయంలో వారు ప్రేత రూపంలో(సూక్ష్మ శరీరం ) ఉంటారు.

ఇదికూడా కర్మలోని భాగమే. అకాలమంరణం పొందినవారు అనగా ఆత్మహత్య చేసికోన్నవారు, ప్రమాదవశాత్తు మరణించినవారు, హత్యకు గురైనవారు ఎక్కువ విరామం లేకుండా జన్మిస్తారు అని ఒక నమ్మకం ఉంది. కాని దీనిలో వాస్తవికత తెలియదు. పైవిధంగా అకస్మాత్ గా మరణించినవారిలో కొంతవరకు గతజన్మ స్మృతులు ఉంటాయని ఒక అంచనాఉంది. ఇది కూడా రుజువు కాలేదు.

కొంతమంది తీవ్రమంత్రసాధన చేసిన సిద్దులు సూక్ష్మశరీరంలోనే ఉండి తమ శిష్యులను లేదా భక్తులను కాపాడుతూ ఉంటారు. వీరబ్రహ్మంగారు తమ కాలజ్ఞానంలో తన రాబోయే జన్మ గురించి చెప్పినట్లు మనలో చాలామందికి తెలుసు. అలాగే గాణగాపూర్ శ్రీ నరిస్మ్ష సరస్వతి స్వామివారు, కురవపురం శ్రీపాదశ్రీవల్లభులవారు, మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారు తమ సమాధినుండి సూక్ష్మశరీరంతో కాపాడుతూ ఉన్నట్లుగా చాలా దృష్టాంతాలు ఉన్నాయి. అటువంటి సిద్దపురుషులు తాము ఎప్పుడూ జన్మిచాలో తామే నిర్ణయించుకుంటారు. ఆరకంగా వారికి జన్మలమధ్య విరామం ఉంటుంది

ఓం తత్సత్

Add new comment

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • Lines and paragraphs break automatically.
  • Web page addresses and email addresses turn into links automatically.